- విచారణకు సహకరించలేదంటూ నమోదైన కేసులో బెయిల్
న్యూఢిల్లీ :ఢిల్లీ ఎక్సైజ్పాలసీ స్కామ్లో ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఈ కేసు విచారణకు సహకరించడంలేదంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫైల్చేసిన రెండు కేసులలో శనివారం ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టు అర్వింద్కేజ్రీవాల్కు బెయిల్మంజూరు చేసింది. అలాగే, రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని అర్వింద్కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మార్చి 16న హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో శనివారం ఉదయం ఆయన హాజరయ్యారు. ఈ కేసును విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా.. కేజ్రీవాల్పై ఈడీ మోపిన ఆరోపణలు బెయిల్పొందడానికి అనుకూలంగానే ఉన్నాయని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అలాగే, ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్కు అందజేయాలని ఈడీని ఆదేశించారు.