ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా బారినపడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండడంతో ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌‌ ద్వారా పోస్ట్ చేశారు. సింప్టమ్స్‌ ఉండడంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్‌లో ఉండాలని, కొవిడ్ టెస్టు చేయించుకోవాలని కోరారు కేజ్రీవాల్. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో ఇటీవల ఆయన బిజీ బిజీగా పర్యటిస్తున్నారు.

కాగా, ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం 4.099 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.64 శాతంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లు పూర్తిగా మూసేశారు.