పంజాబ్ లో పట్టు సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పంజాబ్ లో గెలుపే లక్ష్యంగా కేజ్రీవాల్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ భార్య సునీత, కూతురు హర్షిత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇవాళ పంజాబ్ కు రానున్నారు. ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరపున ప్రచారం చేసేందుకు తనతోపాటు తన కూతురు సంగ్రూర్ జిల్లాకు వెళ్తున్నామని సునీత ట్వీట్ చేశారు. ధురి నుంచి పోటీ చేస్తున్న భగవంత్ మాన్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తప్పకుండా గెలుస్తుందన్నారు.
कल बेटी के साथ अपने देवर भगवंत मान के लिए वोट माँगने धूरी जा रही हूँ।
— Sunita Kejriwal (@KejriwalSunita) February 10, 2022
మరిన్ని వార్తల కోసం