ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తానన్న హామీ గుర్తు లేదా ?

ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తానన్న హామీ గుర్తు లేదా ?
  • ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి

చౌటుప్పల్, వెలుగు : సీఎం కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, అందుకే టీఆర్ఎస్​కు ఓటు వేయవద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నామని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి  నాయకుడు ప్రేమ్ స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్ లో ‘టీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తున్నాం’ అని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు.

ఆర్యవైశ్య కార్పోరేషన్ ​ఏర్పాటు చేయనందుకు నిరసనగా మునుగోడు ఉప ఎన్నికలో ఆర్యవైశ్యులందరూ టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే, మునుగోడులో ఈ 12 రోజులు రోజుకో మండలం చొప్పున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ 119 నియోజకవర్గాల్లో తిరుగుతూ టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు.