మునుగోడులో బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు 

మునుగోడులో బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు 

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. బీజేపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

మర్రిగూడ మండలం అజలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు మండలం చీకటి మామిడి, ఉట్టిపల్లిలో వివిధ పార్టీలకు చెందిన  కార్యకర్తలు రాజగోపాల్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు.