అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రైతుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్న CAAను కూడా వెనక్కి తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు.