ఆశా కార్యకర్తల కలెక్టరేట్ల ముట్టడి

ఆశా కార్యకర్తల కలెక్టరేట్ల ముట్టడి

కరీంనగర్ టౌన్, వెలుగు: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు మహాధర్నా నిర్వహించారు. గురువారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్​ మాట్లాడుతూ ఆశా సమస్యల పరిష్కారమయ్యే వరకు సమ్మె ఉధృతం చేస్తామన్నారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు,ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

రాజన్నసిరిసిల్ల: తమ డిమాండ్లు పరిష్కరించాలని  సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించారు. రెండు గంటలపాటు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. సీఐటీయూ లీడర్​కోడం రమణ మాట్లాడుతూ 11 రోజులుగా ఆశాలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదన్నారు. అనంతరం అడిషనల్​కలెక్టర్​ఖీమ్యానాయక్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు  రమేశ్‌‌‌‌‌‌‌‌, నాగరాజు, పద్మ, మహేశ్‌‌‌‌‌‌‌‌, మంజుల , జయశీల, భారతి, కస్తూరి, రాణి తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్ : తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం ఆశా వర్కర్లు జగిత్యాల కలెక్టరేట్​ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కన్వీనర్ సులోచన మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాల నిర్వహణలో పాలుపంచుకుంటున్న ఆశావర్కర్లను సర్కార్​ చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.