బోనాలతో గోల్కొండకు పోటెత్తిన భక్తులు

బోనాలతో గోల్కొండకు పోటెత్తిన భక్తులు

ఆషాఢ బోనాల ఉత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ ఆరేళ్ల జగదీశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం రెండో పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన భక్తులతో కోట కిక్కిరింది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాల నడుమ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు.

లంగర్ హౌస్, మెహిదీపట్నం, కార్వాన్, మంగళహాట్, పురాణాపూల్, దూల్​పేట, మల్లేపల్లి, సీతారాంబాగ్, షేక్​పేట ప్రాంతాల నుంచి తొట్టెలను ఊరేగిస్తూ తీసుకొచ్చారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు ఒకింత ఇబ్బంది పడ్డారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.