న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషి పేరును అశోక్ గెహ్లాట్ సిఫార్సు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగినా సీఎం పదవి వదిలేదిలేదని ఇంతకాలంచెప్తూ వచ్చిన గెహ్లాట్.. ఇప్పడు రాజస్థాన్ సీఎం సీటులో స్పీకర్ను కూర్చోబెడతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బడ్జెట్ సమావేశాల వరకు అంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారని తెలిపాయి.
పార్టీలో ఒకరికి ఒకే పదవి సూత్రం వర్తిస్తుందని బుధవారం సోనియా స్పష్టంచేసిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించాయి. కాగా, అధ్యక్ష పదవి కోసం పోటీపడేటోళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గెహ్లాట్, థరూర్, కమల్నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మనీశ్ తివారీ, ఖర్గే, సిద్ధరామయ్య కూడా పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.