ఇవాళ్టి ( మే 27 ) నుంచి ఆసియా అథ్లెటిక్స్

ఇవాళ్టి ( మే 27 ) నుంచి ఆసియా అథ్లెటిక్స్

గుమి (సౌత్ కొరియా):  స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లేకుండా ఇండియా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్  ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబుల్ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్సే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.  డైమండ్ లీగ్ పోటీలపై ఫోకస్ పెట్టిన కారణంగా నీరజ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. తొలి రోజు జరిగే మెన్స్ 20 కిలో మీటర్ల వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెర్విన్ సెబాస్టియన్, అమిత్ బరిలో నిలిచారు. 

విమెన్స్‌  జావెలిన్ త్రోలో ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజేత అన్నూ రాణిపై మంచి అంచనాలున్నాయి. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 వేల మీటర్ల రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుల్వీర్ సింగ్, ట్రిపుల్ జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రవీణ్ చిత్రవెల్, అబ్దుల్లా అబూబాకర్ వంటి అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశిస్తున్నారు. అవినాష్ సాబ్లే (3000 మీ. స్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేజ్), యర్రాజీ జ్యోతి  (100 మీ. హర్డిల్స్), పారుల్ చౌదరి (3000 మీ. స్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేజ్)పైనా భారీ అంచనాలున్నాయి.  

ఈ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43 దేశాల నుంచి దాదాపు 2000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఇండియా 6 స్వర్ణాలు సహా 27 పతకాలు గెలిచింది.