నిత్య, జ్యోతికి గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌

నిత్య, జ్యోతికి గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌

తైపీ సిటీ: ఆసియా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో సత్తా  చాటిన తెలంగాణ స్టార్ అథ్లెట్ గంధె నిత్య, ఏపీ అమ్మాయి యెర్రాజీ జ్యోతి తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో మెరిశారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 4x100మీ రిలేలో నిత్య ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ తరఫున స్వర్ణం గెలవగా.. జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. శనివారం జరిగిన పోటీల్లో ఇండియాకు పలు ఈవెంట్లలో మొత్తంగా ఆరు బంగారు పతకాలు లభించాయి. 4x100మీ రిలేలో ఫైనల్లో నిత్య, సుధీక్ష, స్నేహ, అభినయ కూడిన ఇండియా 44.06 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో బంగారు పతకం అందుకుంది. 

నిత్య చివరి లెగ్‌‌‌‌‌‌‌‌లో మెరుపు వేగంతో పరుగెత్తింది. దాంతో ఇండియా టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ రికార్డు బ్రేక్ చేసింది. మెన్స్ 4x100 మీటర్ల రిలేలో గురిందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనిమేశ్ కుజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మణికంఠ, అమ్లాన్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా ఫైనల్లో 38.75 సెకండ్లతో తమ సెకండ్ ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ నమోదు చేస్తూ గోల్డ్ అందుకుంది. ఇక, ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌ జ్యోతి హర్డిల్స్ ఫైనల్లో 12.99 సెకండ్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో గోల్డ్ నెగ్గింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ 110 మీటర్ల హర్డిల్స్‌‌‌‌‌‌‌‌లో తేజన్‌‌‌‌‌‌‌‌ షిర్సే 13.52 సెకండ్లతో అందరికంటే ముందుగా పోడియం ఫినిష్ చేసి స్వర్ణం ఖాతాలో వేసుకున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ ట్రిపుల్ జంప్‌‌‌‌‌‌‌‌లో అబ్దుల్లా అబూబేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16.21 మీటర్లు జంప్ చేసి బంగారు పతకం గెలిచాడు. విమెన్స్ 1500 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో  పూజ 4 నిమిషాల 11.63 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో స్వర్ణం అందుకుంది.