ఇండియా X చైనా.. నేటి నుంచి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

ఇండియా X చైనా.. నేటి నుంచి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

చెన్నై: ఆసియా గేమ్స్​ ప్రిపరేషన్స్‌‌‌‌కు ఫైనల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఇచ్చేందుకు ఇండియా హాకీ టీమ్‌‌‌‌ రెడీ అయ్యింది. మెగా టోర్నీకి ముందు బలం, బలహీనతలను మరోసారి చెక్‌‌‌‌ చేసుకునేందుకు గురువారం మొదలయ్యే ఆసియా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ (ఏసీటీ)ని వేదికగా చేసుకోనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌‌‌‌లో మూడుసార్లు చాంపియన్‌‌‌‌ ఇండియా.. చైనాతో తలపడనుంది. 2007 తర్వాత ఇండియాలో జరుగుతున్న మేజర్‌‌‌‌ టోర్నీ ఇది. అలాగే 2011 తర్వాత తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తుండటంతో ఇండియా టైటిల్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతున్నది. 

ఆసియా గేమ్స్‌‌‌‌ నేపథ్యంలో టీమ్‌‌‌‌లోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లతో పాటు సీనియర్లకు ఈ టోర్నీ పరీక్షగా మారింది. ఈ టోర్నీలో  గెలిస్తే డైరెక్ట్‌‌‌‌గా పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌ ఉండటంతో ఇండియా ఫోకస్​ మొత్తం ట్రోఫీపైనే ఉండనుంది. అదే సమయంలో ప్లేయర్లను పరీక్షించుకోవడంతో పాటు ఆసియా గేమ్స్​ కోసం సరైన కాంబినేషన్​ను ఎంపిక చేసుకోవాలని భావిస్తోంది. 2011, 2016, 2018లో టైటిల్స్‌‌‌‌ నెగ్గిన ఇండియా నాలుగోసారి విజేతగా ఆసియా గేమ్స్‌‌‌‌కు వెళ్లాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది.