చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్: పాక్ పై భారత్ విక్టరీ

చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్: పాక్ పై భారత్ విక్టరీ

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో పాకిస్తాన్ పై భారత్ విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో ఇవాళ(శుక్రవారం) భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది. స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు. పాకిస్తాన్ తరపున జునైద్ మంజూర్ ఒకే ఒక గోల్ నమోదు చేశాడు.