
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించాడు. సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించాడు. ఈ మర్డర్ మిస్టరీ -క్రైమ్ థ్రిల్లర్కు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టుగా సురేష్ బాబు ప్రకటించారు. ఈ మేరకు హీరో, నిర్మాత విజయ్ ఆంటోని ఆయన్ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.