న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్పోకు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ ఎక్స్పోలో ప్రపంచంలోని ప్రముఖ ఆటో కంపెనీలనీ పాల్గొంటున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఫోక్స్వాగన్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, హ్యుండయ్ లాంటి కంపెనీలు ఇప్పటికే తమ న్యూ మోడల్స్తో సందర్శకులను జిల్జిగేల్మనిపిస్తున్నాయి. ఈసారి ఎక్స్పో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్స్పై ఫోకస్ పెట్టింది. ఈ ఎక్స్పోలో వరల్డ్ కారు అవార్డ్స్ ను ప్రకటించబోతున్నారు. ఈ అవార్డ్స్ను వరల్డ్ ఆటో ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. ఈ అవార్డ్స్ దక్కించుకోవడానికి హ్యుండయ్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఐదు వరల్డ్ కారు అవార్డ్స్ కేటగిరీలకు టాప్ 10, టాప్ 5 ఫైనలిస్ట్లను ప్రకటిస్తారు. వీరి నుంచి విన్నర్ను ఎంపిక చేస్తారు. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్తో ఈ సారి ఆటో ఎక్స్పోకు చైనీస్ కంపెనీలు ప్రతినిధులు హాజరుకాకపోవడం కాస్త నిరాశపరిచినట్టయింది.
కొత్త కార్లతో జిల్జిగేల్…
- బిజినెస్
- February 6, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!