బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రత్యర్థి మాగంటి సునీతకంటే 12వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్లోని నగ్రోటా ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్ష్ దేవ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన షమీమ్ బేగం కంటే దేవయాని రాణా ముందంజలో కొనసాగుతున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్ మోసావి.. బుడ్గామ్లో ఆధిక్యంలో ఉన్నారు. మిజోరంలోని డంపాలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్లోని తర్న్ తరన్ ఉప ఎన్నికలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
జమ్మూకాశ్మీర్ లో బుద్గాం, నగ్రోటా , రాజస్థాన్ (అంటా), జార్ఖండ్ (ఘట్శిల), తెలంగాణ (జూబ్లీ హిల్స్), పంజాబ్ (తర్న్ తరన్), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడా)లలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరిగాయి.
