జూలై 23 నుంచి అసెంబ్లీ 24 నుంచి మండలి సమావేశాలు

జూలై 23 నుంచి అసెంబ్లీ 24 నుంచి మండలి సమావేశాలు
  •  25న బడ్జెట్ పెట్టనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌‌ విడుదల అయింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, 24న ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్‌‌లో 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందులో నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై ఆరోజు స్పష్టత రానుంది.

 ఈ నేపథ్యంలో 25న రాష్ట్ర బడ్జెట్‌‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత రోజు సెలవు ఇచ్చి, మరుసటి రోజు నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ జరుపనున్నారు. సుమారు పది రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌‌‌‌ను ప్రకటించనున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు.