కల్వకుర్తి, వెలుగు : దేశంలోని వ్యవసాయ పరపతి సంఘాల అభివృద్ధికి మరింత సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సహకార పరపతి సంఘాల మహిళా డైరెక్టర్ శైలజ తెలిపారు. బుధవారం కల్వకుర్తి పీఏసీఎస్ను సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించారు. సహకార భారతి నాగర్ కర్నూల్ డైరెక్టర్ పాండురంగా రెడ్డి, కల్వకుర్తి పీఏసీఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి, సీఈవో వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
