మదనాపురం, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. సోమవారం అమరచింత మున్సిపాలిటీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమరచింతలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ. నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి. నాగరాజ్ గౌడ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
