చదువుకుంటేనే అసమానతలు దూరం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 చదువుకుంటేనే అసమానతలు దూరం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబమంతా అన్నిరంగాల్లో ముందుంటుందని, చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో స్థాపించిన మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్  ఫస్ట్  ఆధ్వర్యంలో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ ఉచిత శిక్షణ పొందుతున్న మహిళా సంఘాల సభ్యులకు బుధవారం నగరంలోని మెప్మా ఆఫీస్​లో ఎమ్మెల్యే కోర్సుకు సంబంధించిన మెటీరియల్​ను ఫ్రీగా అందించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళా సంఘాల సభ్యుల ఖాతా వివరాలు, లోన్  వివరాలు, తదితర అన్ని అంశాలు కంప్యూటర్ లో నమోదు చేసుకునేలా ట్రైనింగ్​ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో కొత్తగా ఎన్నికైన ఇండిపెండెంట్​ సర్పంచులు​ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ప్రపంచ పెన్షనర్స్  డే సందర్భంగా తెలంగాణ  పెన్షనర్స్  సెంట్రల్  అసోసియేషన్  ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్  కళాభవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. 

గండీడ్ మండలానికి చెందిన అనాథ పిల్లల సంరక్షణ కోసం రిటైర్డ్​ తహసీల్దార్​ ఎస్.చంద్రశేఖర్​ రూ.50 వేలు ఎమ్మెల్యే సమక్షంలో చిన్నారులకు అందించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రిటైర్డ్ ఉద్యోగులు ఎం.సాయిలు గౌడ్, బి.ప్రభాకర్, ఎ.ప్రభాకరాచారి పాల్గొన్నారు.