
- ఉదయం గంట సేపు అసభ్యకర పోస్టులు పెట్టిన దుండగుడు
- అప్రమత్తమై అకౌంట్ రికవరీ చేసిన టెక్నికల్ టీమ్
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’(ట్విట్టర్) హ్యాక్ అయ్యింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య సమయంలో తన ఆధీనంలోకి తీసుకున్న దుండగుడు రెండు, మూడు అసభ్యకర పోస్టులతో పాటు ఓ వీడియోను పెట్టాడు. ఇది గమనించిన స్పీకర్ టెక్నికల్ టీమ్వెంటనే అకౌంట్ను రికవరీ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలుసుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
అకౌంట్ రికవరీ తర్వాత ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఇవాళ(సోమవారం) ఉదయం నా వ్యక్తిగత ‘ఎక్స్’ అకౌంట్ కొంత సమయం హ్యాక్ అయ్యింది. దీన్ని మా టెక్నికల్ టీం వెంటనే గమనించి నా అకౌంట్ తిరిగి సెట్ చేసింది. నా అకౌంట్ హ్యాక్ చేసిన టైంలో అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టారు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని పోస్ట్ చేశారు.