ఎల్బీ నగర్,వెలుగు: రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ఇంజనీర్(ఏఈ) ఏసీబీకి పట్టుబడ్డాడు. నాగోల్ కు చెందిన ప్రదీప్ కుమార్ రెడ్డి ప్రైవేట్ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, రాక్ టౌన్ కాలనీలో ఆనంద్ కుమార్ ఇంటికి వర్క్ కంప్లీషన్ ఫైనల్ రిపోర్ట్ కోసం నెల కిందట నాగోల్ బండ్లగూడ ఎలక్ట్రికల్(టీఎస్ఎస్పీడీసీఎల్)ఏఈ మధుకర్ కు అప్లై చేశాడు. రిపోర్ట్ ఇవ్వకుండా తిప్పుకుంటూ రూ. 15వేలు లంచం ఇవ్వాలని ఏఈ మధుకర్డిమాండ్ చేశాడు. ప్రదీప్కుమార్ రెడ్డి ఏసీబీ అధికారులకు కంప్లయింట్చేశాడు. బుధవారం నాగోల్ లోని ఆఫీసులో ఏఈ మధుకర్ ను ఏసీబీ అధికారుల టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసింది. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. లంచం అడిగే వారిపై 1064 నంబర్ కు కాల్ చేయాలని కోరారు.
మరిన్ని వార్తలు