కాటేజీల నిర్మాణానికి సహకరించాలి

కాటేజీల నిర్మాణానికి సహకరించాలి

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో కాటేజీల నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని కవిత హామీ ఇచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మెదక్​జిల్లా ఏడుపాయలలో శనివారం నిర్వహించిన బోనాల వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డితో కలిసి ఏడుపాయలకు వచ్చిన కవిత గోకుల్​ షెడ్ లో కాత్యాయని దేవి రూపంలో కొలువుదీరిన దుర్గామాతను దర్శించుకున్నారు. కాటేజీల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కోరడంతో అందుకు అంగీకరించారు. కార్యక్రమంలో ఏడుపాయల దేవాలయ కమిటీ చైర్మన్​ సాతెల్లి బాలగౌడ్​, ఈఓ సారా శ్రీనివాస్, జడ్పీ వైస్​ చైర్​పర్సన్​లావణ్య, జిల్లా రైతు సమితి అధ్యక్షుడు సోములు, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.