
కేప్కెనవెరాల్ : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఆరు నెలల పాటు పరిశోధనల్లో పాల్గొన్న నలుగురు ఆస్ట్రోనాట్లు స్పేస్ఎక్స్ క్రూ క్యాప్సూల్ ‘డ్రాగన్’లో క్షేమంగా భూమ్మీదకు తిరిగొచ్చారు. తెలుగు మూలాలున్న ఇండియన్ ఆరిజిన్ఆస్ట్రోనాట్ రాజాచారి, టామ్ మార్ష్బర్న్, కేలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన మాథియాస్ మారర్లు.. గురువారం అర్ధరాత్రి దాటాక గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగారు. డ్రాగన్ ల్యాండ్ అయిన గంట తర్వాత క్యాప్సూల్ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్లు బయటకు వచ్చారు. కాగా, ఒక్క నెలలో స్పేస్ఎక్స్ చేసిన నాలుగో స్పేస్ ప్రయోగం ఇది. రెండు ప్రయోగాల్లో స్పేస్లోకి ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లగా.. మరో రెండు ల్యాండింగ్ ప్రయోగాలను సక్సెస్ఫుల్గా ఎలాన్ మస్క్ సంస్థ నిర్వహించింది. మొత్తంగా 26 మందిని స్పేస్లోకి తీసుకెళ్లింది. అందులో 8 మంది ‘స్పేస్ టూరిస్టులే’ కావడం విశేషం.