ఉత్తరప్రదేశ్ లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నిరసన సెగ తగిలింది. గోండా జిల్లాలో జరిగిన సభలో రాజ్ నాథ్ ప్రసంగించేందుకు సిద్ధమవ్వగా అక్కడే ఉన్న కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ను వెంటనే ప్రారంభించాలని యువత డిమాండ్ చేసింది. వెంటనే స్పందించిన రక్షణ మంత్రి నిరసన తెలుపుతున్న యువకులను శాంతింపజేశారు.అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం
హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ టెస్ట్ చేసిన రష్యా
ఉక్రెయిన్ బార్డర్ లో భారీగా రష్యా సైనికుల మోహరింపు