ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవ..పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవ..పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్
  • పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్​ప్రెస్​ ఆగుతది
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవ
  • దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి సమస్య
  • ఎమ్మెల్యే వివేక్​తో కలిసి వినతిపత్రం అందజేత
  • స్పందించిన రైల్వే అధికారులు

పెద్దపల్లి: స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో తిరుపతి సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైలుకు పెద్దపల్లి స్టేషన్​లో హాల్టింగ్​ మంజూరు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా అక్కడ ఈ రైలుకు అధికారులు హాల్టింగ్​ రద్దు చేశారు. దీంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తమ సమస్యను పెద్దపల్లి ఎంపీ దృష్టికి తీసుకెళ్లాకు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్న ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొన్నానరు. 

చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామితో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​ అరుణ్​కుమార్​జైన్​కు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన రైల్వే అధికారులు తిరుపతి ఎక్స్​ప్రెస్​ను పెద్దపల్లి రైల్వే స్టేషన్​లో నిలుపుతున్నట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. పెద్దపల్లి బైపాస్​ లైన్​ పూర్తి కావడంతో తిరుపతి ఎక్స్​ప్రెస్​ను కరీంనగర్​ నుంచి పెద్దపల్లి బైపాస్​ ద్వారా కాజీపేటకు వెళ్లేలా అధికారులు రూట్​ మ్యాప్​ ప్రకటించారు. 

ఇంతకాలం రైలు రద్దు కారణంగా తిరుపతికి వెళ్లే ఈ ప్రాంత ప్రజలు కాజీపేట వరకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం రైలు పునరుద్దరణకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రజలు కృతజ్క్షతలు తెలిపారు.