
- పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ ఆగుతది
- ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవ
- దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి సమస్య
- ఎమ్మెల్యే వివేక్తో కలిసి వినతిపత్రం అందజేత
- స్పందించిన రైల్వే అధికారులు
పెద్దపల్లి: స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్దపల్లి స్టేషన్లో హాల్టింగ్ మంజూరు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా అక్కడ ఈ రైలుకు అధికారులు హాల్టింగ్ రద్దు చేశారు. దీంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తమ సమస్యను పెద్దపల్లి ఎంపీ దృష్టికి తీసుకెళ్లాకు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్న ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొన్నానరు.
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్కు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన రైల్వే అధికారులు తిరుపతి ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుతున్నట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. పెద్దపల్లి బైపాస్ లైన్ పూర్తి కావడంతో తిరుపతి ఎక్స్ప్రెస్ను కరీంనగర్ నుంచి పెద్దపల్లి బైపాస్ ద్వారా కాజీపేటకు వెళ్లేలా అధికారులు రూట్ మ్యాప్ ప్రకటించారు.
ఇంతకాలం రైలు రద్దు కారణంగా తిరుపతికి వెళ్లే ఈ ప్రాంత ప్రజలు కాజీపేట వరకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం రైలు పునరుద్దరణకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రజలు కృతజ్క్షతలు తెలిపారు.