టోల్ ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయిన ఇసుక ట్రాక్టర్లు

టోల్ ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయిన ఇసుక ట్రాక్టర్లు

యూపీలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఉద్దేశపూర్వకంగా 12 ఇసుక ట్రాక్టర్లతో టోల్‌ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయాయి. కేవలం 52 సెకన్ల వ్యవధిలో 12 ట్రాక్టర్లు టోల్ ప్లాజాను దాటాయంటే అవి ఎంత వేగంగా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 


ఆదివారం ఆగ్రా – గ్వాలియర్ హైవేపై ఉన్న బజౌ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ట్రాక్టర్లలో మొదటిది రోడ్‌బ్లాక్‌ను ఢీకొట్టి టోల్ చెల్లించకుండా వెళ్లిపోయింది. వెనుక వస్తున్న ఇతర ట్రాక్టర్లు దాన్ని అనుసరించాయి. టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా డ్రైవర్లు ఎవరూ ఆగలేదు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన ఆగ్రా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.