హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ ఎథర్ఎనర్జీ ఈఎల్ ప్లాట్ఫామ్ ఆధారిత మొదటి మాస్ మార్కెట్ స్కూటర్ను ఆవిష్కరించనుంది. బెంగళూరులో వచ్చే నెల 29న జరిగే కమ్యూనిటీ డేలో దీనిని ప్రదర్శించనుంది. ఈ కొత్త స్కూటర్ ధర రూ.1.25 లక్షల లోపు ఉంటుంది.
450 సిరీస్ తర్వాత ఎథర్రూపొందించిన సరికొత్త వాహన నిర్మాణ ప్లాట్ఫామ్ ఇదే. ఈఎల్ భవిష్యత్ ఉత్పత్తుల విస్తరణకు, తయారీ సామర్థ్యం పెంపునకు ఎంతగానో దోహదపడుతుంది. ఇదిలా ఉంటే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ విధానంలో రూ.13,00 కోట్లు సేకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఒక్కోషేరును రూ.1,169కి అమ్మనుంది.
