ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు

ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం (మే 13) ఎంజీఎంలో చికిత్స పొందుతూ కాసు రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. రాములు మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని లంబాడి, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో లంబాడి కులస్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. సూపరింటెండెంట్ కులం పేరుతో దూషించారు. 

కులం పేరుతో సూపరింటెండెంట్ దూషించారని గుగులోతు తిరుపతి మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ చంద్రశేఖర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్నారు.