
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని ఓ కల్వర్టు కింద సోమవారం ఓ వ్యక్తి డెడ్బాడీ లభ్యమైంది. సీఐ పందిరి పరశురాం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా నల్లగొండ జిల్లా చిట్యాల్ మండలం చిన్నకాపరికి చెందిన రూపాని వెంకన్న(49)గా గుర్తించారు. విచారణలో రెండు రోజుల కింద పని మీద శామీర్పేటకు వచ్చినట్లు తేలింది. కాగా సోమవారం ఘట్సర్ మున్సిపాలిటీ కొండాపూర్ సమీపంలోని కల్వర్టు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు.