గంజాయి మత్తులో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

గంజాయి మత్తులో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. బీరువెల్లి హేమంత్ రెడ్డి అనే వ్యక్తి అంకం గణేష్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కావడంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితిని సమీక్షించిన వైద్యులు.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అనంతరం గణేష్ తల్లిదండ్రులు హేమంత్ రెడ్డిపై బయ్యారం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు.

దాడికి పాల్పడ్డ యువకుడు గంజాయికి బానిసైనట్టు తెలుస్తోంది. గంజాయి మత్తులోనే గణేష్ పై దాడి చేసినట్టు సమాచారం. మహబూబాబాద్ నుండి బయ్యారాకి గంజాయి సరఫరా అవుతుందని కొన్ని రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పా షాపులు, బెల్టు షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి కొనుగోళ్లు జరుగుతున్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ గంజాయి, మద్యం మత్తులో పడి మైనర్ యువకులు దాడి పాల్పడ్డారని, మరికొంత మంది పరారీలో ఉన్నట్టు సమాచారం.