
అల్వాల్, వెలుగు: భూవివాదంలో ఓ అడ్వకేట్పై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అస్మత్ పేటలోని సర్వే నంబర్ 1లో స్థలం విషయంలో నగరానికి చెందిన న్యాయవాది మొయినుద్దీన్, ఇతరురులకు మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా శుక్రవారం అడ్వకేట్ మొయినుద్దీన్ అక్కడికి వెళ్లారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో న్యాయవాదిపై కొందరు దాడి చేశారు. ఆయన కారుపై రాళ్లు విసిరారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. న్యాయవాది అసభ్య పదజాలంతో దూషించి తమపై దాడికి పాల్పడ్డారంటూ కొందరు మహిళలు, స్థానికులు కంప్లయింట్ ఇచ్చారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.