
- నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ఘటన
నార్కట్పల్లి, వెలుగు : నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్పై కొందరు నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో స్థానిక డోకూరి గార్డెన్కు వెళ్లారు.
అక్కడున్న నాయకులు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లనని స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ ఘటనపై 100కు కాల్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా నని వెల్లడించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సీఐ నాగరాజు పోలీస్ స్టేషన్కు వచ్చి అశోక్ కుమార్తో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిరసన విరమించారు.