కీవ్: రష్యా నల్ల సముద్రానికి సంబంధించిన నౌకదళ హెడ్ క్వార్టర్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్రిమియా ద్వీపం.. సెవాస్టోపోల్ నగరంలోని ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీన్ని 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకుంది. నల్ల సముద్రం నౌకదళ ప్రెస్ సర్వీస్ అధికారులు దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. హోం మేడ్ డ్రోన్తో దాడి జరిగిందని వివరించారు. తక్కువ శక్తిగల పేలుడు జరిగిందని ప్రకటించారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకెళ్లామని సెవాస్టోపోల్ మేయర్ తెలిపారు.