పురానాపూల్ మఠంలోని సాధువులపై దాడి

పురానాపూల్ మఠంలోని సాధువులపై దాడి

మెహిదీపట్నం, వెలుగు: కుల్సుంపురా పోలీస్​స్టేషన్​పరిధి పురానాపూల్ మఠంలోని సాధువులపై శనివారం కొందరు భూ కబ్జాదారులు దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. మఠంలో ప్రభు ప్రశాంత్ దాస్ సాధువుతోపాటు మరికొందరు ఉంటున్నారు. అయితే, ఈ మఠం స్థలాన్ని కొందరు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.  కోర్టులో కేసు కూడా నడుస్తోంది. 

సదరు స్థలానికి దూల్​పేట్ కు చెందిన అజయ్ సింగ్ తాళం వేయడంతో ఇరువర్గాల మధ్య శనివారం సాయంత్రం గొడవ జరిగిందని సీఐ రాములు తెలిపారు. ఈ ఘటనలో సాధువులతోపాటు అజయ్ సింగ్ కు కూడా గాయాలైనట్లు పేర్కొన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.