బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారులో మైనార్టీ స్కూల్ భవనానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆనుకుని సర్వే నెం.156 లో ఉన్న రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ట్రాక్టర్తో దున్నడం కలకలం రేపింది.
ఇక్కడ భూముల విలువ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఈ కబ్జా వెనుక స్థానిక నాయకుల హస్తం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కబ్జా విషయాన్ని బెల్లంపల్లి తహసీల్దార్ఎల్.కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా భూమిని దున్నిన ప్రాంతాన్ని ఆర్ఐ పరిశీలించారని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
