పియానో వాయించి అమ్మాయిలను బుట్టలో పడేస్తాడు

పియానో వాయించి అమ్మాయిలను బుట్టలో పడేస్తాడు
  • పెండ్లి పేరుతో 19 మంది మహిళలకు మోసం

నల్గొండ క్రైం, వెలుగు: పెండ్లి పేరిట మహిళలను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నల్గొండ పట్టణానికి చెందిన తలకొప్పుల విలియమ్స్ ​నార్కట్​పల్లి పీహెచ్​సీలో ల్యాబ్​టెక్నిషియన్​గా చేస్తున్నాడు. అలాగే స్థానికంగా ఉండే చర్చిలో పియానో వాయించేవాడు. పట్టణంలోని బీటీఎస్​కు చెందిన ఓ మహిళతో 9 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఎన్ జీ కాలేజీ సమీపంలోని అద్దె గదిలో ఆమెను ఉంచి బంధువులందరికి భార్యగా పరిచయం చేశాడు. అలా ఆమె డబ్బు రూ.20 లక్షల వరకు వాడుకున్నాడు.

అక్టోబర్​ 31న డబ్బుల విషయమై ఆ మహిళ అడగడంతో ఆమెను చంపుతానని బెదిరించాడు. దాంతో ఆమె గోడ దూకి తాను పారిపోయింది. తర్వాత విలియమ్స్​ గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే మరొకరితో పెండ్లయిందని తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చర్చికి వచ్చే యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని, ఇలా 19 మంది మహిళలను మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విలియమ్స్​ను విచారిస్తున్న సమయంలో గుండె నొప్పి వచ్చిందని హైడ్రామా చేయడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అంతా బాగానే ఉందని, కావాలనే డ్రామా ఆడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో వన్​టౌన్​ పోలీసులు విలియమ్స్​ను అరెస్టు చేశారు. ఐపీసీ 376, 377, 382, 342, 420 కింద అతడిపై కేసు నమోదు చేశారు.