కేఆర్​ఎంబీ చైర్మన్​గా అతుల్ జైన్

కేఆర్​ఎంబీ చైర్మన్​గా అతుల్ జైన్

హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ ​మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) చైర్మన్​గా అతుల్​ జైన్​ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అతుల్​ జైన్​ నియామకం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు నెలకు రూ.2.24 లక్షల వేతనం ఉంటుందని చెప్పారు.