రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మళ్లీ వేలం.. ఎప్పుడంటే

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మళ్లీ వేలం.. ఎప్పుడంటే

మార్చి నెలలో బండ్లగూడలోని పోచారం ఫ్లాట్ల వేలం ప్రారంభం కానుంది. రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ (నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్రూం (3BHK), డబుల్ బెడ్రూం(2BHK), సింగిల్ బెడ్రూం(1BHK), సింగిల్ బెడ్రూ సీనియర్ సిటిజన్(1BHK- Sr Citizen)  ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3వ తేదీ (శుక్రవారం)న లాటరీ పద్దతి నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఒ ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ గా 3BHK కోసం రూ.3 లక్షలు,  2BHK కోసం రూ.2 లక్షలు, 1BHK కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులు అవుతారు. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే ఈ లాటరీకి పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో.. ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్ బుక్ ల ద్వారా తిలకించవచ్చు.

 https://www.youtube.com/@ACEMedialive
 https://www.facebook.com/AceMediaLive
 https://youtube.com/@IPRTelanganaGovt