భారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ

భారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ విభజన రోజులు భయంకరమైనవని ప్రధాని మోడీ అన్నారు. అఖండ భారత్.. ఇండియా, పాకిస్థాన్ గా విడిపోయిన నేపథ్యంలో దానికి స్మృతిగా విభజన గాయాల స్మారక దినంగా ప్రకటిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ రోజున దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, ప్రజల సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. దేశ విభజన మిగిల్చిన గాయాలు ఎప్పటికీ మానవన్నారు. అనవసర ద్వేషం, హింస వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సామాజిక విభజన, అసమానతలను రూపుమాపాల్సిన అవసరాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తోందన్నారు.