IND vs AUS: ఐదో టీ20లో టాస్ ఓడిన ఇండియా.. తిలక్ వర్మ స్థానంలో రింకూ సింగ్

IND vs AUS: ఐదో టీ20లో టాస్ ఓడిన ఇండియా.. తిలక్ వర్మ స్థానంలో రింకూ సింగ్

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20లో గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే 2-2 తో సిరీస్ సమం అవుతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇండియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి రింకూ సింగ్ ని ప్లేయింగ్ 11లోకి తీసుకొని వచ్చారు.    

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): 

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ ఎలెవన్): 

మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా