10 వేల ఒంటెలను చంపనున్న ఆస్ట్రేలియా

10 వేల ఒంటెలను చంపనున్న ఆస్ట్రేలియా

కార్చిచ్చుతో ఆస్ట్రేలియాలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. అత్యధిక శాతం భూభాగాన్ని మంటలు దహించివేశాయి. మిగతా ప్రాంతాలకు కూడా పాకుతుండడంతో ప్రజలు లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు బీచ్ ల్లోనే వంటావార్పు చేసుకుంటూ అక్కడే కాలం గడుపుతున్నారు. దీనికి తోడు నీటి సమస్య తీవ్రంగా ఉండటం… ఒంటెలు ఎక్కువగా నీటిని ఉపయోగించడంతో కరువు ఏర్పడింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం సుమారు 10 వేల ఒంటెలను చంపాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కార్చిచ్చు కారణంగా వేడిని భరించలేక ఒంటెలు ఇళ్లలోకి చొరబడి అధికంగా నీటిని తాగేస్తున్నాయి. ఇళ్లకు వేసిన ఫెన్సింగ్ లను కూడా ధ్వంసం చేస్తూ నీటి వనరులను పాడుచేస్తున్నాయి. అంతేకాదు.. నీళ్ల కోసం ఇళ్లకు అమర్చిన ఏసీలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజల కనీస అవసరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రజల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఐదు రోజులల్లో దాదాపు 10 వేల ఒంటెలను చంపేందుకు హెలిక్టార్లను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు ఒంటెలను కాల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.