పుస్తెలతాడు చోరీ చేసిన ఆటో డ్రైవర్

పుస్తెలతాడు చోరీ చేసిన ఆటో డ్రైవర్
  •  పట్టుకొని పోలీసులకు అప్పగించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి


నర్సాపూర్, వెలుగు:  ఆటోలో ఎక్కిన ప్రయాణికురాలికి కత్తి చూపించి  పుస్తెలతాడు చోరీ చేసిండో ఆటోడ్రైవర్.  వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఉరడి సురేశ్ శనివారం ఇస్మాయిల్ ఖాన్ పేట్‌కు చెందిన అమృతను ఆటోలో ఎక్కించుకొని నర్సాపూర్ వైపు బయల్దేరాడు. బీవీఆర్‌‌ఐటీ కాలేజీకి దగ్గరకు రాగానే ఆటోను పక్కకు ఆపి కత్తి చూపించి ఆమె మెడలోంచి  పుస్తెలతాడు లాక్కున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటువైపుగా వెళ్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ తన కారును ఆపి మహిళతో మాట్లాడింది. విషయం తెలుసుకొని తన అనుచరులతో కలిసి ఆటో డ్రైవర్‌‌ను పట్టుకొని పుస్తెలతాడును తీసుకొని బాధితురాలకు అప్పజెప్పింది.  పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందిడుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..