కామారెడ్డిలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ

కామారెడ్డిలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ  బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ ​జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

కొత్త బస్టాండ్​చర్చి గ్రౌండ్ ​నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్​రోడ్, రైల్వే కమాన్, స్టేషన్​రోడ్, నిజాంసాగర్​చౌరస్తా మీదుగా వెలమ ఫంక్షన్​హాల్​వరకు సాగింది. ఇక్కడ డ్రైవర్లు సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.