వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్​ కోసం..  అవినాశ్​ రెడ్డి పిటిషన్

వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్​ కోసం..  అవినాశ్​ రెడ్డి పిటిషన్

హైదరాబాద్, వెలుగు: వైఎస్​వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగ ళవారం కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసులో సీబీఐ  అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్​ ఇవ్వాలని కడప వైఎస్సార్​ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్​ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు పలుసార్లు హాజరై వివరణ ఇచ్చానని,  సీబీఐ తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేనందునే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఈ పిటిషన్‌ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.