ఫెస్టివల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్​లో ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్​కు అవార్డు

ఫెస్టివల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్​లో ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్​కు అవార్డు

ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన ఫెస్టివల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్​లో ‘వెలుగు’ ఫొటో జర్నలిస్ట్ నరేశ్ వరికిల్లకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. నరేశ్ తీసిన కొమురవెల్లి జాతరలోని శివసత్తుల ఫొటోకు ఈ అవార్డును ప్రకటించినట్లు అకాడమీ నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతుల అందజేత యాన్యువల్ ఫంక్షన్లలో ఉంటుందన్నారు.
– వెలుగు, హైదరాబాద్