ప్లాస్టిక్​ నిర్మూలనతో పర్యావరణానికి మేలు..డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన సదస్సు

ప్లాస్టిక్​ నిర్మూలనతో పర్యావరణానికి మేలు..డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన సదస్సు

ముషీరాబాద్, వెలుగు: ప్లాస్టిక్​ను వీలైనంత వరకు దూరం పెడితేనే పర్యావరణానికి మేలు జరుగుతుందని లా స్టూడెంట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం’ అనే థీమ్ తో రెండు రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ముగింపు సందర్భంగా కాలేజీ విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.

డాక్టర్​  అంబేద్కర్ లా కళాశాల నుంచి బర్కత్​పురలోని లంబాడి తండా వరకు విద్యార్థులు, ఫ్యాకల్టీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కళాశాల సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన మొక్కలు నాటారు.