
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యావరణ హిత ఇటుకల తయారీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వీ పాటిల్సూచించారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో సండే బ్రిక్స్ చాలెంజ్ పేర ఆదివారం నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్ చాంపియన్ షిప్ పోటీ కోసం యువతతో పాటు ఉద్యోగులు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పోటీలో పాల్గొనే వారికి ఇటుకల తయారీకి అవసరమైన ఇసుక, సిమెంట్, మట్టితో పాటు తాగునీరు, టెంట్ సౌకర్యం కల్పించామన్నారు. పోటీలో పాల్గొన్న వారికి టీ షర్ట్స్, క్యాప్లను కలెక్టర్ అందజేశారు. ఇటుకలో తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎస్ఈబీ నిపుణులు అందజేశారు.