పర్యావరణ హిత ఇటుకల తయారీపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ 

పర్యావరణ హిత ఇటుకల తయారీపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యావరణ హిత ఇటుకల తయారీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ వీ పాటిల్​సూచించారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో సండే బ్రిక్స్​ చాలెంజ్​ పేర ఆదివారం నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్​ చాంపియన్​ షిప్​ పోటీ కోసం యువతతో పాటు ఉద్యోగులు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

పోటీలో పాల్గొనే వారికి ఇటుకల తయారీకి అవసరమైన ఇసుక, సిమెంట్, మట్టితో పాటు తాగునీరు, టెంట్​ సౌకర్యం కల్పించామన్నారు. పోటీలో పాల్గొన్న వారికి టీ షర్ట్స్​, క్యాప్​లను కలెక్టర్​ అందజేశారు. ఇటుకలో తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎస్​ఈబీ నిపుణులు అందజేశారు.