నిర్మల్​లో అయోధ్య అక్షింతల ఊరేగింపు

నిర్మల్​లో అయోధ్య అక్షింతల ఊరేగింపు

నిర్మల్, వెలుగు: అయోధ్య నుంచి నిర్మల్​కు వచ్చిన శ్రీరాముని అక్షింతలను భక్తులు ఘనంగా ఊరేగించారు. స్థానిక బాగులవాడలోని హనుమాన్ మందిరంలో  బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, ముఠా గణేశ్, నవీన్ తదితరులు అక్షింతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా రావుల రామనాథ్ మాట్లాడుతూ.. నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి హిందువూ తమ ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాలని కోరారు.