అయోధ్య రాముడి గుడి జనవరిలో ప్రారంభం

అయోధ్య రాముడి గుడి జనవరిలో ప్రారంభం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక లు ఘనంగా నిర్వహించనున్నట్లు  రామమందిర్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం వెల్లడించా రు. ఈ పవిత్ర కార్యానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని, 25 వేల మంది హిందూ మత పెద్దలు, ప్రముఖ సాధువులను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఇతర వీఐపీలను కూడా ఆహ్వానించేందుకు లిస్ట్ తయారు చేశామన్నారు. రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపుతామని చెప్పారు. త్వరలో అందరికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తారని తెలిపారు. భక్తులకు నెలరోజులపాటు అన్నదాన కార్యక్రమం, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడతామని చంపత్ రాయ్ పేర్కొన్నారు. -